అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది తృతీయ త్రైమాసిక సంవత్సర ఆరంభం నేపథ్యంలో నేటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన రూల్స్తో పాటు.. ఐటీ చెల్లింపులు, హెల్త్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నియమాల్లో మార్పులు వచ్చాయి. అంతేకాదు.. ఉజ్వల పథకంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
అక్టోబర్ 1వ తేదీ నుంచి మారుతున్న నిబంధనలేంటో పూర్తి వివరాలు ఏంటంటే..
- ఇకపై డ్రైవింగ్ చేసేటప్పుడు.. ట్రాఫిక్ పోలీసులకు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను హార్డ్ కాపీలను చూపించక్కర్లేదు. వాటికి బదులుగా.. డీజీ లాకర్, ఎం-పరివాహన్ వంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్లో చూపించినా సరిపోతుంది.
- మొబైల్ ఫోన్లను డ్రైవింగ్ చేసేప్పుడు నావిగేషన్ నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా ఉపయోగించేప్పుడు డ్రైవర్ తన డ్రైవింగ్పై ఏకాగ్రతను కోల్పోకూడదు.
- ఇక ఇప్పటి వరకు ఉచితంగా లభించిన ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన ఎల్పీజీ కనెక్షన్లు ఇకపై ఫ్రీగా లభించవు.
- ఫారిన్ ట్రిప్స్ వెళ్లేవారు.. 5 శాతం పన్నులను చెల్లించాలి. (ట్యాక్స్ కలెక్టర్ ఎట్ సోర్స్ టీసీఎస్)
- మిఠాయి షాపుల్లో విడిగా బాక్సుల్లో పెట్టి అమ్మే స్వీట్లకు కూడా “బెస్ట్ బిఫోర్ డేట్”ను తెలియజేయాలి. ప్యాకెట్లలో ఉంచిన స్వీట్లతో పాటు.. విడిగా అమ్మే స్వీట్లకు కూడా ఇవి వర్తిస్తాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ను తప్పని సరిగా పాటించాలి.
- హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించిన వాటిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రీమియం ధరలు మరింత పెరగనున్నాయి. అయితే అదే సమయంలో హెల్త్ పాలసీల్లో కరోనాను కూడా చేర్చనున్నారు. అంతేకాదు.. మరో 17 రకాల అనారోగ్యాలకు కూడా కవరేజ్ కల్పించనున్నారు.
- టీవీలు మరింత ప్రియం కానున్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు.. విదేశాల నుంచి దిగుమతైన టీవీలపై 5 శాతం దిగుమతి సుంకాన్ని పెంచనున్నారు.
- 8.క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడెన్స్ను జారీ చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ నిమిత్తం.. డిజిటల్ పేమెంట్స్పై కస్టమర్స్ స్వచ్ఛందంగా పరిమితులు విధించుకోవచ్చు.
- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం.. ఇకపై ఆవ నూనెను.. ఇతర నూనెలతో కలిపి తయారు చేయడం నిషేధం.
- వస్తు సేవల అమ్మకంపై ఈ-కామర్స్ ఆపరేటర్ 1 శాతం పన్నును తగ్గించాలని ఐటీ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.