జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 101 ఏళ్లు.. అసలు ఆ రోజు ఏం జరిగింది..?

Spread the love

అది భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోనే అత్యంత దురదృష్టమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ మారణకండ ఉదంతం నిలిచిపోయింది. అప్పటి బ్రిటిష్ పాలకుల రాక్షసత్వానికి  వందలమంది అమాయకులు ప్రాణాలు విడిచారు. బ్రిటీష్ సైనికులు తుపాకీ గుండ్లకు.. నేలకొరిగారు. వీరిలో కేవలం మగవారే కాదు.. మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ జలియన్‌ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఓ ఆరెడెకరాలలో ఉన్న ఓ తోట. సిక్కులకు అత్యంత పవిత్రమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా.. వేలాది మంది సిక్కుల కుటుంబాలు.. ప్రతియేడులాగే ఆ 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు.

అయితే, ఇదే వైశాఖీ ఉత్సవాల్లో.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.. తీసుకొచ్చిన రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు జాతీయోద్యమకారులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ రౌలత్‌ చట్టం ప్రజలను అణగదొక్కే కఠినమైన చట్టం కావడంతో.. అప్పటి ఉద్యమకారులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు.. దీనిని అమలు చేస్తుండటంతో.. ప్రజలంతా బ్రిటీష్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే.. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను బ్రిటీష్ సర్కార్‌ అరెస్ట్ చేసి.. వారిని దేశ బహిష్కరణ విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ
ప్రజలుదేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. అంతేకాదు.. వైశాఖీ ఉత్సవాన్ని పురస్కరించుకుని జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ.. వారికి సంఘీభావం తెలిపారు.

అయితే ఇదే సమయంలో.. అప్పటి బ్రిటీష్ జనరల్ రెజినాల్డ్‌ డయ్యర్.. సైన్యంతో ఈ జలియన్ వాలాబాగ్‌ తోటపై దాడికి దిగాడు. ఉత్సవంలో పాల్గొన్న వేలమంది అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. అదికూడా అత్యంత రాక్షసానందం పొందుతూ కాల్పులకు దిగాడు. ఆ తోట నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి.. నిరాయుధులైన ప్రజలపై 50 మంది బ్రిటీష్ సైనికులు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు.అన్నిమార్గాలను మూసివేసి బుల్లెట్ల వర్షం కురిపించడంతో.. ప్రజలు అందులో నుంచి బయటకు వెళ్లలేక.. తుపాకీ గుండ్లకు నేలకొరిగారు. అలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగానే ప్రాణాలువిడిచారు. మరో రెండు వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే కొందరు తోటలోకి గోడలు ఎక్కి బయటపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినా.. వారిపై గుండ్ల వర్షం కురిపించడంతో.. గోడలపై రక్తాన్ని చిందిస్తూ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరైతే..
అక్కడు ఉన్న బావిలోకి కూడా దూకేశారు. ఇంతటి మారణకాండలో వెయ్యి మందికి పైగా మరణిస్తే.. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం 379 మంది చనిపోయినట్లు పేర్కొంది.

గతేడాది… జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ బ్రిటిష్‌ ఇండియన్‌ చరిత్రలోనే సిగ్గుచేటుగా గతేడాది బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న థెరిసా మే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు..బ్రిటన్‌ అధికారికంగా క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్నారు. ఇక 1997లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించే ముందు.. అప్పటి బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భారత్‌తో తమ గత చరిత్రలో ఈ జలియన్‌ వాలాబాగ్‌ దురాగతం ఓ బాధాకరమైందని పేర్కొన్నారు.

గతేడాది 2019కి ఈ మారణకాండకి వందేళ్లు పూర్తయ్యింది. నేటికి 101 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా జలియన్ వాలాబాగ్‌ దారుణ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ.. అమరులైన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు మరిచిపోలేనివని కొనియాడారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

 


Spread the love
error: Content is protected !!