పాకిస్థాన్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో రావల్పిండి నగరంలో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావల్పిండి నగరంలో మంగళవారం రాత్రి ముగ్గురు దుండుగులు ఆయుధాలతో ప్రవేశించారు. వారు రోడ్డుపై ఉన్న వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే మృతిచెందగా.. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు కారకులు ఎవరన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నామని.. ఇప్పటి వరకు ఎవర్నీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు.