కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నామనుకున్న వేళ.. రష్యాపై ప్రకృతి పగబట్టినట్లుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రష్యా మాత్రం కాస్త ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ప్రకృతి మరోరూపంలో పగబట్టింది. కరోనాను ఎదుర్కొంటున్న తరుణంలో.. రష్యన్ దీవుల్లో భూకంపం సంభవించింది.
బుధవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.5గా నమోదైనట్లు.. యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. రష్యన్ పట్టనానికి 219 కిలో మీటర్ల దూరంలోని కురీల్ దీవుల్లో 56.7 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.