బిగ్‌ బ్రేకింగ్‌.. భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 9 మంది అల్‌ఖాయిదా ఉగ్రవాదుల అరెస్ట్‌

Spread the love

దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్‌ వేసిన అల్‌-ఖాయిదా ప్లాన్‌ను ఎన్‌ఐఏ చిత్తుచేసింది. ఈ అల్-ఖాయిదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న తొమ్మిది మంది అనుచరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌, కేరళలోని ఎర్నాకులంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.

ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో వీరు పాక్‌ కేంద్రంగా ఆక్టివ్‌గా ఉన్నఅల్‌-ఖాయిదా ఉగ్రవాదులతో సోషల్ మీడియా వేదికగా ఆకర్షితులయ్యారని.. దేశ రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో దాడులకు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇక వెస్ట్‌బెంగాల్‌, కేరళలో పట్టుబడ్డ వారి వివరాలను ఎన్‌ఐఏ తెలియజేసింది. లియు యన్‌ అహ్మద్‌, అబు సుఫియన్‌లు వెస్ట్ బెంగాల్‌కు చెందిన వారని.. మోసరఫ్ హొస్సెన్‌, ముర్షిద్ హసన్‌ కేరళకు చెందిన వారని తెలిపుతూ.. వారి చిత్రాలను విడుదల చేసింది.


Spread the love
error: Content is protected !!