12 ఏళ్ల బాలిక కిడ్పాప్‌..ఆపై రేప్‌..? ఇస్లాంలోకి మతం మార్చి.. అంతేకాదు..

Spread the love

పాక్‌లోని హిందువుల గురించి ఆలోచిస్తే.. ఇక మరికొన్ని రోజుల్లో అక్కడ హిందువులు అనేవాళ్లు ఉంటారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారత స్వాతంత్ర్యానికి ముందు అక్కడ ఉన్న హిందువుల సంఖ్యతో పోల్చితే ఇప్పుడు కనీసం 10శాతం కూడా ఉన్నారో లేదో తెలియడం లేదు. ముఖ్యంగా సింధ్‌ ప్రాంతంలో హిందువుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో పాక్‌లో ఉన్న ఇస్లామిక్ జిహాదీ మూకలు ఇక్కడి హిందూ యువతులను టార్గెట్ చేశారు. నిత్యం హిందూ, క్రైస్తవ యువతులను, మహిళలను అపహరించుకుపోవడం.. ఆపై అత్యాచారాలు చేసి.. బలవంతపు మతమార్పిడిలు చేస్తున్నారు. అనంతరం వారిని మతం మార్చి వివాహాలు చేసుకుంటున్నారు. లేని పక్షంలో వారిని హతమార్చేందుకు కూడా సిద్దమవుతున్నారు.

తాజాగా.. సింధ్‌ ప్రాంతంలోని సంఘర్‌ పట్టణం కిప్రో ప్రాంతానికి చెందిన రేఖ అనే ఓ 12 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. సదరు బాలిక తండ్రి పేరు రూప్‌ కోల్హీ. అయితే సదరు బాలికను స్థానిక ముస్లిం జిహాదీలే కిడ్నాప్ చేసి ఉంటారని అంతా భావించారు. అయితే 60 ఏళ్ల హనీఫ్‌ బోజ్దర్‌ ఈ కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. అంతేకాదు.. సదరు బాలికపై రేప్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతటితో ఆగకుండా.. సదరు మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చి వివాహం కూడా చేసుకున్నట్లు తెలిసింది. అయితే వివాహం చేసుకున్న 60 ఏళ్ల హనీఫ్‌ బోజ్దర్‌కు ఓ భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, బాధిత బాలిక ప్రస్తుతం స్థానిక ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతోంది. స్కూల్ రిజిస్టర్‌ ప్రకారం.. సదరు బాలిక 2009లో జన్మించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను.. వివరాలను పాక్ హిందూ సంస్థలు సోషల్ మీడియాలో పోస్టులు చేశాయి.

కాగా, ఇలాంటి ఘటనలు పాకిస్తాన్‌లో రోజుకు కనీసం మూడు నుంచి ఐదు వరకు జరుగుతుంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇస్లాం మతానికి చెందిన వారు కాకుండా ఉన్న బాలికలను, యువతులను, మహిళలను టార్గెట్‌ చేస్తూ ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారని పాకిస్తాన్‌ రైట్ వింగ్ రైటర్స్ చెబుతున్నారు.

 


Spread the love
error: Content is protected !!