స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్పై కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కుంటాల జలపాతాన్ని అల్లు అర్జున్తో పాటుగా.. పుష్ప మూవీ టీం సభ్యులు సందర్శించారని.. ఈ క్రమంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆర్టీఐకి చెందిన ప్రతినిధులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. షూటింగ్ అనుమతులు లేకున్నప్పటికీ.. తిప్పేశ్వర్లో షూటింగ్ చేశారని.. కుంటాల జలపాత సందర్శనను అధికారులు నిలిపేసినప్పటికీ.. వీరు సందర్శించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.
కాగా, పుష్ప చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. రెడ్ సాండిల్ మాఫియా అంశంతో చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.