సింధ్ ప్రావిన్స్లో హిందువులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు మైనార్టీ బాలికలను, యువతులను కిడ్నాప్ చేసి బలవంతపు మతమార్పిడిలు జరిగేవి. అయితే ఇటీవల హిందూ కుటుంబాలపై ఏదో రకమైన దాడులు చేయడం.. హతమార్చడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు బయటపడుతున్నాయి. ఇటీవల ఓ బాలికపై యజమాని తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. అంతేకాదు.. బీల్ కమ్యూనిటికి చెందిన ఇద్దరు మహిళలు పొలంలో పనిచేస్తుండగా.. అక్కడి యజమాని వారిపై ఎలాంటి కారణం లేకుండానే విచక్షణారహితంగా చావబాదాడు. ఈ వరుస ఘటనలన్ని సోషల్ మీడియా వేదికగా బయటపడ్డాయి.
తాజాగా ఇదే సింధ్ ప్రావిన్స్ ప్రాంతలోని తట్టా సమీపంలో ఉన్న ఘరో పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శ్యాము కోహ్లీని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ పాకిస్తాన్ హిందూ రెఫ్యూజస్ ట్విట్టర్లో పేర్కొంది.
FIR Copy https://t.co/giXPA8xctb pic.twitter.com/VeQtO5j2EQ
— Pakistani Hindu Refugees (@hindurefugees) April 29, 2021