దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హత్రస్ ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నలుగురు కామాంధుల దాడిలో అసువులు బాసిన బాధితురాలి మృతదేహాన్ని.. అర్ధరాత్రి దహనం చేయడంతో ఈ కేసు వివాదం మరింత ముదిరిపోయింది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో పలు రాజకీయ పార్టీల నేతలు.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్మించేందుకు హత్రస్ బాటపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రతో పాటు.. ఇతర పార్టీల నేతలు కూడా హత్రస్ పర్యటనలు చేశారు. అయితే వీరు చేస్తున్న ఈ పర్యటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
తాజాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ నేత పర్యటన వివాదాస్పదంగా మారడమే కాదు.. ఆయన బాధ్యతారహిత్యాన్ని బహిర్గతం చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ తాజాగా హత్రస్ బాధితురాలి కుటుంబాన్ని సందర్శించాడు. అంతేకాదు.. బాధితురాలి (మృతురాలి) తండ్రిని కూడా అతి సమీపంలో ఉండి మాట్లాడారు. అయితే అలా మాట్లాడటంలో ఎలాంటి తప్పులేదు. అంతేకాదు.. ఓ ప్రజానేతగా ఆయన బాధ్యత కూడా. కానీ ఆయన ఓ విషయాన్ని విస్మరించారు. అదేంటంటే.. ఇటీవలే ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Read More
పట్టభద్రులారా.. ఆన్లైన్లో మీ ఓటు మీరే నమోదు చేసుకోండి.. ఈ సింపుల్ స్టెప్స్తో..!
ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్యే సెప్టెంబర్ 29వ తేదీన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని..తనను కలిసిన వారంతా క్వారంటైన్లో ఉంటూ.. టెస్టులు చేయించుకోవాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు.. హోం ఐసోలేషన్లోనే ఉంటున్నట్లు కూడా తెలిపారు.
पिछले दो दिनों से मुझे हल्का बुख़ार होने की वजह से आज मैंने #Covid19Test कराया जिसकी रिपोर्ट postive आयी है जिसके बाद मैं घर पर #HomeIsolation में रहूँगा जो भी साथी पिछले 2-3 दिनो में मुझसे मिले है वो अपना टेस्ट ज़रूर करा ले !
— MLA Kuldeep Kumar (@KuldeepKumarAAP) September 29, 2020
అయితే అక్టోబర్ 4వ తేదీన హత్రస్ బాధిత కుటుంబాన్ని పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి కలిశారు. అంతేకాదు ఆ కుటుంబ సభ్యులందరితో కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Read More..
అయితే ఆప్ ఎమ్మెల్యే పర్యటనపై ఢిల్లీకి చెందిన బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి.. ఇలా హోం ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించి.. బాధిత కుటుంబాన్ని పరామర్మిస్తావా..? కరోనా వ్యాప్తికి కారకుడివవుతావా..?అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సదరు ఎమ్మెల్యేపై ఎపిడమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ట్వీట్స్ను బీజేపీ ఢిల్లీ శాఖ పోస్ట్ చేసింది.
29 सितम्बर को केजरीवाल जी के विधायक अपने आप को कोरोना पॉजिटिव बता रहे हैं और 4 तारीख को सभी की जान जोख़िम में डालकर ये घटिया राजनीति करने हाथरस चले गए। कौनसे प्रोटोकॉल के तहत ये 5 दिन में हाथरस गए? इनपर एपिडेमिक एक्ट के तहत तुरंत कार्यवाही होनी चाहिए। pic.twitter.com/tOExmBcrpP
— BJP Delhi (@BJP4Delhi) October 5, 2020
Read More
గాంధీజీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఐదు అంశాలు.. ఆచరిస్తే అద్భుతమే