అయోధ్య రామ మందిర నిర్మాణానికి “ఆర్య వైశ్య పరపతి సంఘం” చెక్‌ సమర్పణ

Spread the love

అయోధ్య శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి రోజు ప్రారంభమైన ఈ అభియాన్‌.. ఫిబ్రవరి తెలంగాణ ప్రాంతంలో జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ అభియాన్‌ కొనసాగుతోంది. కార్పోరేషన్‌ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి సమర్పణ అభియాన్ చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో జరిగిన జన జాగరణ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌ జీ పర్యటించారు. స్థానిక ఆర్య వైశ్య సంఘంకి విచ్చేసిన ఆయన.. బాలాజీనగర్‌ ఆర్య వైశ్య పరపతి సంఘం సభ్యులతో పాటు బాలాజీ నగర్‌ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు చిరంజి రవీందర్‌ గుప్తాతో మందిర నిర్మాణం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పరపతి సంఘం సభ్యులు రూ.25,116/- చెక్‌ను ప్రాంత ప్రచారక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పరపతి సంఘం అధ్యక్షుడు బద్రేశ్‌, సభ్యులు రమేష్, సోమ సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రాంత ప్రచారక్‌తో పాటుగా.. మల్కాజ్‌గిరి జిల్లా సంచలన సమితి సహ సంయోజక్‌ రజినీ కాంత్‌,నిధి ప్రముఖ్‌ రమేష్‌ జీ, బాలాజీనగర్‌ నగర సంచలన సమితి సంయోజక్‌ దేవేందర్‌ జీ, సంచలన సమితి సభ్యులు సంతోష్‌ గుప్తా,రాం బాబు, జోగారావు, రామ కృష్ణ, సతీష్‌ పాల్గొన్నారు.


Spread the love
error: Content is protected !!