ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అంతేకాదు అంతర్జాతీయ విమానాలతో పాటు.. దేశీయంగా కూడా విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇతర రాష్ట్రాల బార్డర్ల వద్ద కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. అయితే బంగ్లాదే్ నుంచి ఓ ముప్పై ఏళ్ల యువకుడు బార్డర్ దాటి భారత్కు చేరాడు. అది కూడా నాలుగు కిలోమీటర్లు నది ఈదుకుంటూ. భారత్ – బంగ్లాదేశ్కు మధ్య ఉన్న కుషియారా నదిని దాటి దేశంలోకి చొరబడ్డాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బీఎస్ఎఫ్ రంగంలోకి దిగింది. సిల్చర్ కేంద్రంగా పనిచేస్తున్న బీఎస్ఎఫ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి పేరు అబ్దుల్ హక్ గా గుర్తించారు. అతని వయస్సు ముప్పై ఏళ్లు. ఆదివారం ఉదయం 7.30 సమయంలో కుషియారా నదిని దాటి భారత్ బార్డర్లో అడుగుపెట్టాడు. అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో చొరబడ్డాడని.. అతన్ని విచారణ చేపట్టగా.. బంగ్లాదేశ్లోని సునమ్ గంజ్ ప్రాంతానికి చెందిన వాడిగా తేలినిట్లు అధికారులు తెలిపారు.
అతనికి కరోనా వైరస్ సోకినట్టు కూడా విచారణలో తెలిపాడని.. భారత్లో వైద్యం చేయించుకోడానికి నది దాటుకుంటూ వచ్చినట్లు చెప్పినట్లు అధికారులు. అయితే సదరు వ్యక్తిని తిరిగి బంగ్లాదేశ్ బార్డర్ బలగాలకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్కు చెందిన భద్రతా బలగాలు రెండు పడవల్లో వచ్చి సదరు వ్యక్తిని తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సదరు వ్యక్తి కరోనా పాజిటివ్తో వచ్చినట్లు తెలియడంతో స్థానిక గ్రామస్థులు భయపడుతున్నారు. బార్డర్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో.. బంగ్లా సరిహద్దుల్లో కూడా పెట్రోలింగ్ను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.