న్యూ ఇయర్‌ ధమాకా.. జియో కస్టమర్లకు ఇక పండగే పండగ..!

Spread the love

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డాటా ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తూ.. అనతికాలంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లను పొందింది. అయితే అనూహ్యంగా గతేడాది వినియోగదారులకు షాకిస్తూ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్‌ కాల్స్‌పై ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీలు (ఐయూసీ) వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జియో కస్టమర్లు అంతా షాక్‌కు గురయ్యారు. అప్పటి నుంచి జియో కస్టమర్ల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుండగా..
అదే సమయంలో ఎయిర్‌టెల్‌ పుంజుకుంది. అందుకు కారణం.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడమే. ఈ క్రమంలో జియో 2021 కొత్త సంవత్సరం సందర్భంగా తమ కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇక నుంచి జియో వినియోగ దారులు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం.. ఈ శుక్రవారంతోనే ముగుస్తుండటంతో ఈ సదుపాయాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.‘ఐయూసీ (ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి) విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను
పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. 2021 జనవరి 1వ తేదీ నుంచి జియో కస్టమర్లు దేశంలోని ఏ ఇతర నెట్‌వర్క్‌కైనా ఉచితంగానే వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు’అంటూ రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Spread the love
error: Content is protected !!