కేరళలో ఇంత దారుణమా..? కరోనా సోకిన యువతిపై అంబులెన్స్‌ డ్రైవర్‌ అఘాయిత్యం.. ఆపై

Spread the love

అక్షరాభ్యాసంలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్పుకునే కేరళ రాష్ట్రం.. గత కొద్ది రోజులుగా క్రైం రేటులో కూడా దూసుకెళ్తోంది. హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పథనంతిట్ట జిల్లాలోని అరన్మల సమీపంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ యువతిపై అంబులెన్స్‌ డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కరోనా కేర్‌ సెంటర్‌ వద్ద వదిలేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా పేషెంట్స్‌ను తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్‌కు చెందిన డ్రైవర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. అయితే అంతకు ముందు ఓ కరోనా పేషెంట్‌ను కరోనా కేర్ సెంటర్‌ వద్ద డ్రాప్‌ చేసి.. ఆ తర్వాత ఒంటిరిగా ఉన్న కరోనా సోకిన యువతిని అంబులెన్స్‌లో ఎక్కించుకున్నట్లు తెలిపారు. అనంతరం నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత బాధిత యువతిని కరోనా కేర్‌ సెంటర్‌ వద్ద వదిలేశాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.


Spread the love
error: Content is protected !!