లదాఖ్లో మరోసారి భూ ప్రకంపనలు స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. శుక్రవారం నాడు సాయంత్రం 4.27 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.4 మాగ్నిట్యూడ్గా నమోదైంది. లదాఖ్ ప్రాంతంలో 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలలజీ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత కాస్త తక్కువగానే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అధికారులు తెలిపారు.