నాసిక్‌లో వరుస భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోతున్న జనం

Spread the love

గత కొద్ది రోజులుగా దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారితో వణకిపోతున్న ప్రజలకు ప్రకృతి కూడా మరింత భయపెడుతోంది. మహారాష్ట్రలో గత రెండు మూడు నెలలుగా పాల్‌ఘర్‌, నాసిక్‌, ముంబై పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. అయితే వీటి తీవ్రత స్వల్పంగా ఉండటం ద్వార ఎలాంటి నష్టం వాటిల్లడం లేదు.

తాజాగా మంగళవారం ఉదయం వరుస భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. తొలుత ఉదయం 9.50 నిమిషాలకు నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ తర్వాత మళ్లీ 10.15 నిమిషాలకు మరోమారు కంపించింది. తొలుత సంభవించిన భూ ప్రకంపనలు రిక్టార్‌ స్కేల్‌పై 3.8గా నమోదైంది. ఆ తర్వాత వచ్చిన మరో భూకంపం 2.5గా నమోదైంది. ఈ రెండు భూకంపాలు కూడా నాసిక్‌కు పశ్చిమాన 103 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

https://twitter.com/ANI/status/1303212915034525699
https://twitter.com/ANI/status/1303193243471896576

కాగా, ఇదిలావుంటే.. మంగళవారం నాడు తెల్లవారు జామున కార్గిల్‌లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. అండమాన్ నికోబార్‌ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. అయితే భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.

https://twitter.com/ANI/status/1303112858163503104

Spread the love
error: Content is protected !!