జమ్ముకశ్మీర్లో గత కొద్ది రోజులుగా భూ ప్రకంపనలు భయాందోళనను కల్గిస్తోంది. శుక్రవారం నాడు లదాఖ్ ప్రాంతంలోని లేహ్లో భూకంపం వచ్చిన సంఘటన మరువక ముందే.. తాజాగా శనివారం మధ్యాహ్నం 12.02 గంటలకు జమ్ముకశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.