కార్గిల్‌లో భూ ప్రకపంనలు

Spread the love

యావత్ దేశం ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు ఇదే సమయంలో ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తుండగా.. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతూ జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే.. గతకొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా వస్తున్న ఈ భూకంపాలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

తాజాగా.. లదాఖ్ ప్రాంతంలోని కార్గిల్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం నాడు తెల్లవారుజామున 5.47 నిమిషాలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. నార్త్ నార్త్-వెస్ట్ కార్గిల్‌కు 435 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.


Spread the love
error: Content is protected !!