ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా మానవాళిపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండగా.. మరికొన్ని చోట్ల భూ ప్రకంపనలు ప్రజల్ని వణికిస్తున్నాయి.
తాజాగా జపాన్లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. శనివారం ఉదయం 8.14 గంటలకు రాజధాని టోక్యకు నార్త్ నార్త్ ఈస్ట్ దిశగా 407 కిలో మీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 6.0 మాగ్నిట్యూడ్గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.