బ్రేకింగ్‌.. అంతర్వేది ఘటనపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం..!

Spread the love

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యా రథం దగ్ధం ఘటనపై జగన్‌ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రథం దగ్ధం ఘటన పెను దుమారం రేపింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు దద్ధరిల్లాయి. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ గురువారం నాడు సంచలన నిర్ణయం తీసుకుంది. అతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ.. హోం శాఖకు లేఖ రాసినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఈ అంతర్వేది ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ.. శుక్రవారం నాడు జీవో వెలువడే అవకాశం ఉంది.


Spread the love
error: Content is protected !!