ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమైన పార్టీ అంటూ గతంలో ఓ ముద్ర ఉండేది. కానీ క్రమక్రమంగా మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని చాటుతూ బోణీ కొట్టారు. ఇక ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ మరో నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో రాజస్థాన్లో పార్టీని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జైపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. రాజస్థాన్లో త్వరలోనే పార్టీని ప్రారంభిస్తాం.. అంతేకాదు.. 2023లో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, అసలు లక్ష్యం పార్టీని జాతీయ స్థాయిలో విస్తరింపజేయాలన్నదే ఓవైసీ వ్యూహమని అర్ధమవుతోంది. రాజస్థాన్ అనంతరం.. గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీని విస్తరింపజేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది.
We have decided to launch our party in Rajasthan in the next 1-1.5 months. Since we are launching the party in the state, we will definitely contest the next Assembly elections: AIMIM President Asaduddin Owaisi in Jaipur pic.twitter.com/X6OfzLfILd
— ANI (@ANI) November 15, 2021