గిరిజన మహిళను అపహరించి, ఇస్లాంలోకి మార్చిన మునాఫ్ అలీ.. 12 ఏళ్లలో 5 గురు పిల్లలను… చివరకు… బజరంగ్ దళ్ ఎంట్రీతో…

Spread the love

అసోంలో జరిగిన ఓ సంఘటన కలకలం సృష్టించింది. కాచర్ జిల్లాలో ఒక గిరిజన వర్గానికి చెందిన ఓ హిందూ మహిళను మునాఫ్ అలీ అనే ముస్లిం వ్యక్తి బందీగా ఉంచాడు. సదరు గిరిజన మహిళ ఒక కాలుకు పొడవాటి ఇనుప గొలుసుతో కట్టి ఉంచి, క్రమం తప్పకుండా హింసించి, బలవంతంగా హింసిస్తున్నాడు. అంతేకాదు బలవంతంగా ఇస్లాంలోకి మార్చి.. భార్యగా ఉంచుకున్నాడు.

అయితే ఇటీవల మూడు నెలల క్రితం మునాఫ్ అలీ ఇంట్లో ఒక హిందూ మహిళను క్రూరంగా హింసిస్తున్నారని స్థానికులు అక్కడి హిందూ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన హిందూ సంఘాలు విషయం తెలుసుకోగా.. మునాఫ్ అలీ తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, గొలుసుతో బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు మరియు స్థానిక ఆదివాసీ సంఘాల సహకారంతో సదరు మహిళను రక్షించారు. అనంతరం మునాఫ్ అలీని అరెస్టు చేశారు.

కాగా, సదరు మహిళను గొలుసులతో కట్టేసిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. అందులో ఇంట్లో తిరిగే అంత వరకు మాత్రమే గొలుసు ఉన్నట్లు అందులో కనిపిస్తోంది.

మరో విషయం ఏమిటంటే.. సదరు గిరిజన మహిళను మునాఫ్ అలీ 12 సంవత్సరాల క్రితం అపహరించాడు. అనంతరం ఆమెను బందీగా ఉంచి.. బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. ఈ క్రమంలో ఆమె ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పిల్లలు నిందితుడి సోదరుడి వద్ద ఉన్నారు.

 


Spread the love
error: Content is protected !!