బార్డర్‌లో స్మగ్లర్ల అరెస్ట్‌.. పట్టుబడ్డ గోవులను చూస్తే షాక్‌..!

Spread the love

దేశం నుంచి అక్రమంగా జరుగుతున్న గోవుల రవాణాకు బీఎస్ఎఫ్‌ చెక్ పెట్టింది. అసోం సరిహద్దు మీదుగా దేశం నుంచి గోవులను తరలించే ముఠాను అరెస్ట్ చేశారు గువాహటి ఫ్రంటియర్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది. మన దేశానికి చెందిన ఐదుగురు గోవుల స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకంగా 101 గోవులను కాపాడారు. ఈ సంఘటన సౌత్ సలమర, దుబ్రీ జిల్లాలో జరిగింది.

ఆగస్టు 25వ తేదీ రాత్రి సమయంలో దేశం నుంచి అక్రమంగా గోవులను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని గుర్తించి పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలావుంటే.. భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా నిత్యం గోవుల రవాణా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా స్మగ్లర్లు..గోవులను సరిహద్దు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అనేకమార్లు బీఎస్ఎఫ్ చెక్ పెట్టింది.


Spread the love
error: Content is protected !!