తెలంగాణ హైకోర్టు గురువారం నాడు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా ప్రతిఏటా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పటాకులు కాల్చడంతో వాతావరణ కాలుష్యం పెరుగుతోందని.. బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించాలంటూ న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చడం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనలను విన్న హైకోర్టు.. ఇప్పటి వరకు తెరిచి ఉన్న క్రాకర్స్ షాప్స్ను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా క్రాకర్స్ అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఈ నెల(నవంబర్)19వ తేదీన తెలపాలంటూ హైకోర్టు తెలిపింది.
అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్ సంయోజక్ సుభాష్ చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ రెండు రోజుల ముందు ఇలాంటి నిషేధం తీర్పు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. బాణాసంచా విక్రయించే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే చిరువ్యాపారులు అంతా బాణాసంచా కొనగోలు చేసి.. అమ్మకాలకు సిద్ధమయ్యారని.. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో వారంతా రోడ్డున పడేలా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. బాణాసంచా కాల్చడంపై నిషేధాన్ని ఎత్తివేసాలా చూడాలని డిమాండ్ చేశారు.
ALSO READ
క్రాకర్స్ బ్యాన్ తీర్పును వ్యతిరేకిస్తూ సంచలన విషయాలు వెల్లడించిన న్యాయవాది కరుణాసాగర్
క్రాకర్స్ నిషేధం తీర్పుపై కేసీఆర్ సర్కార్ వైఖరి ఏంటి..?పండుగలు జరుపుకుంటే కేసులు నమోదు చేస్తారా..?