బజరంగీలకు షాకింగ్ న్యూస్..!

Spread the love

గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి పేరుతో వీర హనుమాన్ విజయ యాత్ర, బైక్ ర్యాలీలు,సాయంత్రం శోభాయాత్రలతో ఓ పండగ వాతావరణం ఉండేది. ముఖ్యంగా భాగ్యనగరంలో కోఠి నుండి.. బోయిన్ పల్లిలోని తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగేది. అయితే ఈ ఏడాది వీర హనుమాన్ విజయ యాత్ర లేదని బజరంగ్ దళ్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుటుండటం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్రను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ సారి.. ఏప్రిల్ 8వ తేదీన ఈ వీర హనుమాన్ విజయ యాత్ర జరగాల్సి ఉంది. కానీ.. కరోనా ఎఫెక్ట్‌తో ఈ సారి ర్యాలీపై పడింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్‌ కన్వినర్ సుభాష్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు.


Spread the love
error: Content is protected !!