గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి పేరుతో వీర హనుమాన్ విజయ యాత్ర, బైక్ ర్యాలీలు,సాయంత్రం శోభాయాత్రలతో ఓ పండగ వాతావరణం ఉండేది. ముఖ్యంగా భాగ్యనగరంలో కోఠి నుండి.. బోయిన్ పల్లిలోని తాడ్ బంద్ హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగేది. అయితే ఈ ఏడాది వీర హనుమాన్ విజయ యాత్ర లేదని బజరంగ్ దళ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుటుండటం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్రను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ సారి.. ఏప్రిల్ 8వ తేదీన ఈ వీర హనుమాన్ విజయ యాత్ర జరగాల్సి ఉంది. కానీ.. కరోనా ఎఫెక్ట్తో ఈ సారి ర్యాలీపై పడింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్ కన్వినర్ సుభాష్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు.