హిందూ సమాజ రక్షణ కొరకై.. రామాయంపేటలో బజరంగ్‌ దళ్‌ శౌర్య ప్రశిక్షణ వర్గ..!

Spread the love

హిందూ సమాజ రక్షణ కోసమే బజరంగ్‌ దళ్‌ పనిచేస్తుందని విశ్వ హిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి స్థానుమలయన్‌ గారు అన్నారు. మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో రెండు రోజుల ప్రశిక్షణ వర్గ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ వర్గలో బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకు హిందూ ధర్మము, హిందూ సంస్కృతి పట్ల అవగాహనతో పాటుగా.. శారీరక, మానసిక శిక్షణను ఇస్తున్నట్లు వర్గ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్‌ గారు, రాష్ట్ర సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి గారు, బజరంగ్‌ దళ్‌ కన్వీనర్ సుభాష్‌ చందర్‌, కో కన్వీనర్లు శివ రాములు, కుమార స్వామి, మెదక్‌ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ వర్గలో 118 స్థలాల నుంచి 208 మంది శిక్షార్ధులు పాల్గొన్నట్లు సమాచారం.


Spread the love
error: Content is protected !!