హిందూ సమాజ రక్షణ కోసమే బజరంగ్ దళ్ పనిచేస్తుందని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి స్థానుమలయన్ గారు అన్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేటలో రెండు రోజుల ప్రశిక్షణ వర్గ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ వర్గలో బజరంగ్ దళ్ కార్యకర్తలకు హిందూ ధర్మము, హిందూ సంస్కృతి పట్ల అవగాహనతో పాటుగా.. శారీరక, మానసిక శిక్షణను ఇస్తున్నట్లు వర్గ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ గారు, రాష్ట్ర సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి గారు, బజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్, కో కన్వీనర్లు శివ రాములు, కుమార స్వామి, మెదక్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ వర్గలో 118 స్థలాల నుంచి 208 మంది శిక్షార్ధులు పాల్గొన్నట్లు సమాచారం.