సింగర్ గా మారిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..

Spread the love

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. కరీనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ 53వ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిశుమందిర పాఠశాల నేర్పిన క్రమశిక్షణ,దేశభక్తి, జాతీయభావాలను ఆయన గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో హాజరైన బండి సంజయ్.. విద్యార్థులను ఉత్సాహపపరిచేలా ప్రసంగించారు. తాను చదువుకున్న రోజుల్లో గీత్ పాడితే మొదటి బహుమతి వచ్చిందని అక్కడి విద్యార్థులకు చెప్తూ.. అప్పట్లో పాడిన గీత్ ను వినిపించారు. నాడు ఇదే శిశుమందిర్లో విద్యార్థిగా చదువుకుని.. నేడు ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Spread the love
error: Content is protected !!