మీరు తెలంగాణ ప్రజల ఆస్తి.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన బండ్ల గణేష్..!

Spread the love

ప్రముఖ నటుడు, డైరక్టర్‌ బండ్ల గణేష్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం నాడు.. కరోనా వైరస్ నిర్మూలన అంశంపై హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. కరోనాపై యుద్ధం ముగించాలంటే.. మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ పొడగించాలని.. ఈ విషయం ప్రధాని మోదీతో కూడా చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు సడన్‌గా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే.. మళ్ల కరోనా విజృంభిస్తే.. అదుపు చేయడం కష్టమవుతుందని.. అందుకే మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడగిస్తే.. ఈ మహమ్మారిని తరిమేయొచ్చన్నారు. లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని.. డబ్బు ఇవ్వాల పోతే.. రేపు సంపాదించుకోవచ్చు గానీ.. ప్రాణాలు పోతే ఎలా అన్నారు. ప్రజాసంక్షేమం కోసమే ఈ లాక్‌డౌన్‌ అని.. ఇది శిక్ష కాదని.. ప్రజల కోసమేనన్నారు.

సీఎం నిర్వహించిన ఈ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా హర్ఫం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్‌కు మద్దతు తెల్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా నేత విజయ శాంతి కేసీఆర్‌ నిర్ణయానికి జై కొట్టారు. తాజాగా మరో నేత.. డైరక్టర్ బండ్ల గణేష్ సైతం కేసీఆర్‌పై పొగడ్తల వర్ఫం కురిపిస్తూ.. తన ట్విట్టర్‌లో పోస్టులు చేశారు. ఈ సమయంలో అంతా రాజకీయాలు పక్కనబెట్టి.. కేసీఆర్‌
నాయకత్వంలో పనిచేయాలన్నారు. కేసీఆర్‌ జాతిరత్నమని.. రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి.. మాకు ధైర్యం నింపండంటూ కోరారు. రియల్‌ హీరో అంటే మీరేనని.. మీరు తెలంగాణ ప్రజల ఆస్తి అంటూ కొనియాడారు. డాక్టర్ విషయంలో కార్మికుల విషయంలో సీఎం గిఫ్ట్ విధానం అద్భుతం అంటూ.. మిగతా 29 రాష్ట్రాల్లో కూడా.. ప్రతి సీఎం కేసీఆర్ లాగా ఉండుంటే.. ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ గా ఉండేదంటూ పొగడ్తలు కురిపించారు.


Spread the love
error: Content is protected !!