బైపోల్‌లో బంగ్లాదేశీ.. ఓటేస్తూ పట్టుబడ్డ యువకుడు.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Spread the love

బంగ్లాదేశీయులు అక్రమంగా దేశంలోకి చొరబడటమే కాదు.. ఏకంగా భారత రాజ్యంగం దేశ ప్రజలకు కల్పించిన ఓటు హక్కును కూడా అక్రమంగా వేసేందుకు సిద్ధమయ్యారు. అక్రమ మార్గంలో దేశంలోకి ఇప్పటికే అనధికారికంగా 4 కోట్ల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా వెస్ట్ బెంగాల్‌, త్రిపుర, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌లో ముస్లింల పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌ యూత్‌ అన్న ఓ బ్యానర్‌ కలకలం రేపింది. దీనిపై స్థానిక బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఫ్లెక్సీలో మార్పులు వచ్చాయి కానీ.. చర్యలు తీసుకున్నారా..? అన్నది తెలియదు.

ఇక సరిహద్దు రాష్ట్రాలైన వెస్ట్‌ బెంగాల్‌, త్రిపురలో వీరి అరాచకాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వెస్ట్‌ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేస్తూ పట్టుబడ్డాడు ఓ బంగ్లాదేశీ యువకుడు. రాష్ట్రంలోని నార్త్‌ 24 పరగణా జిల్లాలోని ఖర్గా నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది.

పై చిత్రంలో ఉన్న రెడ్‌ కలర్‌ టీ షర్ట్‌ వేసుకున్న వ్యక్తిని బంగ్లాదేశీయుడిగా గుర్తించిన స్థానిక బీజేపీ నేతలు అతడిని అడ్డుకున్నారు. అనంతరం పోలింగ్‌ స్టేషన్‌ లైన్‌లో ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించగా.. తాను తప్పు చేశానంటూ సమాధానం ఇచ్చాడు. బీజేపీ అభర్థి జాయ్‌ సాహా.. ఖర్గాలో నకిలీ ఓటు వేస్తున్న బంగ్లాదేశీయుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది. దీనిని నేషనల్‌ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌లో ప్రత్యేక కథనం ప్రచురించింది.

కాగా, సదరు వ్యక్తి టీఎంసీకి ఓటు వేయడానికే పోలింగ్‌ స్టేషన్‌ వద్దకు వచ్చినట్లు సమాచారం. దీనిపై భారత ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇక బీజేపీ ఐటీ సెల్‌ నేషనల్‌ కన్వీనర్‌ అమిత్‌ మాల్వియా ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఓటు వేయరనుకుని నిర్ణయించుకున్న మమతా బెనర్జీ.. బంగ్లాదేశీయులతో రిగ్గింగుకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పాక్‌ నుంచి కూడా ఓటర్లను తీసుకుని వచ్చినా.. ఆశ్చర్యపోవక్కర్లేదంటూ చురకలంటించారు.


Spread the love
error: Content is protected !!