ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఆదివారం గుడ్న్యూస్ తెలిపింది. డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్2020 షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
తొలిమ్యాచ్లో ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొనబోతున్నాయి. ఈ తొలిమ్యాచ్ సెప్టెంబర్ 19వ తేదీ శనివారం నాడు అబుదాబిలో జరగనుంది. ఇక ఆ తర్వాతి రోజు 20వ తేదీ ఆదివారం నాడు రెండో మ్యాచ్ దుబాయి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఇక సోమవారం 21వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య పోటీ జరగనుంది. ఇక తొలిమ్యాచ్ భారత కాలమాన ప్రకారం.. రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.