క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌2020 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌..!తొలి మ్యాచ్‌ ముంబై వర్సెస్‌ చెన్నై

Spread the love

ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ ఆదివారం గుడ్‌న్యూస్ తెలిపింది. డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్2020 షెడ్యూల్‌ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

తొలిమ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ ఢీ కొనబోతున్నాయి. ఈ తొలిమ్యాచ్‌ సెప్టెంబర్‌ 19వ తేదీ శనివారం నాడు అబుదాబిలో జరగనుంది. ఇక ఆ తర్వాతి రోజు 20వ తేదీ ఆదివారం నాడు రెండో మ్యాచ్‌ దుబాయి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఇక సోమవారం 21వ తేదీన సన్ రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్స్‌ మధ్య పోటీ జరగనుంది. ఇక తొలిమ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం.. రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

 
 

 


Spread the love
error: Content is protected !!