ఆవు.. హిందువులు గోమాత అని పూజిస్తారు. 33కోట్ల దేవి దేవతలకు ప్రతిరూపం గోమాత అని హిందువుల నమ్మకం.గోవుని గోమాత, విశ్వ మత అని అంటారు. అందుకు కారణం సృష్టిలో ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ అదే ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు అని అంటారు. అంతే కాదు గో సేవ చేసిన వారు చాలా తక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు అని మన పూర్వీకులు చెప్పేవారు. అందుకే పూర్వం ప్రతి ఇంట్లో ఓ గోమాత ఉండేదట. హిందువులు నూతన గృహ ప్రవేశం అయిన.. తొలుత గోమాత పాదాలను ఆ ఇంట్లో పెట్టించాలని.. గోపూజ చేసి తొలుత అవుతోనే గృహా ప్రవేశం చేయిస్తుంటారు. ఇక గోవుని పూజించడం తో పాటుగా పలు ఆహారపదార్థాలు కూడా తినిపిస్తూ ఉంటారు.ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని హిందువుల నమ్మకం.
ప్రస్తుతం చాలామంది నర ఘోషతో ఇబ్బంది పడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాంటి వారు గోమాతకి బంగాళా దుంపలను తినిపిస్తే నర ఘోష నివారణ అవుతుందని నమ్మకం. అలాగే వ్యాపారం లో అభివృద్ధి కోరుకునే వారు క్యారెట్లను గోమాతకు తినిపిస్తే సరి. వారంలో ఏదో ఒక రోజు ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి అమావాస్యకు గోమాతను దర్శించుకుని ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని హిందువుల నమ్మకం. సో మీరు నర ఘోష ప్రభావం ఉంది అని భయపడితే.. ఇలా గోమాతకు ఆహారాన్ని అందిచి ఆ భయాన్ని పోగొట్టు కొండి.