ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది అధినాయకత్వం. సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రస్తుతం సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. తూర్పు గోదావరికి చెందిన ఆయన.. విద్యార్ధి దశలో ఏబీవీపీలో పనిచేశారు. గత నలభై ఏళ్లుగా ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇక ఆయన స్థానంలో సోము వీర్రాజు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా, నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజును అధినాయకత్వం నియమించడంతో.. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో బీజేపీ బలమైన రాజకీయ పార్టీగా అవతరించేలా.. సోము వీర్రాజు నాయకత్వంలో ముందుకు వెళుతుందని ఆశిస్తున్నట్లు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Bharatiya Janata Party appoints Somu Veerraju as president of party's Andhra Pradesh unit. pic.twitter.com/4SBVOgi1H4
— ANI (@ANI) July 27, 2020