దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా ముస్లింలు పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ఆరోపణలు చేస్తూ.. నిరసనలకు దిగింది. అంతేకాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీకి తోడుగా అటు లెఫ్ట్ పార్టీలు,దీదీ సర్కార్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. ఇక ఢిల్లీలో గత ఫిబ్రవరి మాసంలో నిరసనలు హింసాత్మకంగా మరీనా విషయం తెలిసిందే. ఇంత జరిగాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ CAA వల్ల దేశంలో ఎవరు కూడా పౌరసత్వాన్ని కోల్పోరని స్పష్టం చేసింది.అది కూడా రాజ్యసభలో.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కపిల్ సిబాల్ గురువారం ఈ విషయాన్నీ చెప్పారు. దీనికి సంబంధించి రాజ్యసభలో కపిల్ సిబాల్ మాట్లాడిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే తాము NRC,NPR లను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
तो ये बात @INCIndia को मालूम है की #CAA किसी की भी नागरिकता नहीं छीनता,, फिर किस इरादे से कोंग्रेस की अध्यक्ष सोनिया गांधी जी लोगों को आरपार की लड़ाई लड़ने के लिए उकसा रही हैं? pic.twitter.com/DUb3LChOJo
— Manoj Tiwari (@ManojTiwariMP) March 13, 2020