బీజేపీకి బిగ్ షాక్..
పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ..
టీఎంసీ పార్టీలోకి జంప్
వెస్ట్ బెంగాల్ లో అధికార పార్టీ టీఎంసీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ వస్తున్న బీజేపీకి ఆ పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీజేపీలో గెలిచిన పలువురు నేతలు ఇప్పటికే దీదీ పక్కన చేరారు. అందులో ప్రముఖులు ఉన్నారు.
అయితే తాజాగా బీజేపీ లోక్ సభ ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. టీఎంసీ గూటికి చేరారు. కోల్ కతాలో టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని.. ఏసీ గదుల్లో కూర్చొని రాజకీయం చేయడం కాదని.. క్షేత్ర స్థాయిలో పనిచేయడమే రాజకీయం అని వ్యాఖ్యానించారు.
https://twitter.com/ANI/status/1528349962765242368?t=-HEQfD1Fg4j2AV06xuOheQ&s=19
అర్జున్ సింగ్ టీఎంసీ కండువా కప్పుకోవడంతో ఆయన అనుచరులు.. ఎంపీ ఇంటి వద్ద బీజేపీ జెండాలను తొలగించి టీఎంసీ జెండాలను ఎగురవేశారు.
West Bengal | BJP flags were removed from the residence of Barrackpore MP Arjun Singh and TMC flags were put as the leader rejoined TMC after quitting BJP today. pic.twitter.com/l5J9GA33FF
— ANI (@ANI) May 22, 2022