టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైసీపీ భారీ షాక్ ఇచ్చింది. టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగరేసింది. కుప్పం మున్సిపాలిటీ కానీ.. నియోజకవర్గం కానీ టీడీపీకి కంచుకోటలాంటింది. అయితే ఊహించని రీతిలో టీడీపీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇందులో 18 స్థానాలతో వైసీపీ విజయం సాధించగా.. తెలుగు దేశం పార్టీ 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక మరో స్థానం ఏకగ్రీవమైంది.
చంద్రబాబు కంచుకోటలో వైసీపీ ఘన విజయం సాధించడంతో.. అక్కడి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కుప్పంతో పాటు.. వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో కూడా సంబరాలు మిన్నంటాయని తెలుస్తోంది.