భైంసా ఘర్షణలపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Spread the love

ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా లో చోటుచేసుకున్న ఘర్షణలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తన అధికారిక ట్వీట్టర్ నుండి కామెంట్స్ చేశారు.

 

“భైంసాలో నేడు సాయంత్రం జరిగిన అల్లర్లను ఖండిస్తున్నాను. అల్లర్లలో ఇద్దరు రిపోటర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. రిపోర్టర్లు, పోలీసులపై దాడి చేస్తారా ? మనం భారత్ లో ఉన్నామా ? పాకిస్థాన్ లో ఉన్నామా ?”

 

“పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలి. ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయొద్దు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసాలో తరుచు అల్లర్లు జరుగుతున్నాయి.ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తరలించాలి.”

 


Spread the love
error: Content is protected !!