బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ రైతు చట్టాలను రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్లకు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యలు చేశారు. రైతులకు లబ్దిపొందేలా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ రైతు చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. అయితే రైతులకు అర్ధమవ్వకుండా బ్రోకర్లు ట్రాప్ చేశారని.. నిరసనల వెనుక బ్రోకర్లు ఉన్నారని అన్నారు. భవిష్యత్తులో రైతులకు చట్టాల గురించి అర్ధమయ్యాక చట్టాలను తీసుకురమ్మని డిమాండ్ చేస్తారని అన్నారు.