హతమార్చుతాం.. బీజేపీ ఎంపీకి ISIS Kashmir నుంచి బెదిరింపులు

Spread the love

బీజేపీ ఎంపీ, టీం ఇండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ను హతమార్చుతామంటూ ఐసిస్‌ బెదిరింపులకు పాల్పడింది. గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం ఈస్ట్‌ ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఫైర్‌ బ్రాండ్‌గా ఉంటూ.. ట్విట్టర్‌ వేదికగా యాక్టివ్‌ ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపులు రావడంతో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంభీర్‌ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, బెదిరింపులకు సంబంధించిన అంశంపై దర్యాప్తు చేపడుతున్నామని ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీ శ్వేతా చౌహాన్‌ తెలిపారు.


Spread the love
error: Content is protected !!