దేశంలో గత కొద్ది రోజులుగా పెట్రో మంటలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ చేరుకుంది. సరాసరిగా రూ.92కు పైగానే పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పెట్రోల్,డీజీల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తున్నట్లు ప్రకటించడంతో.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో.. ఈ సెస్ను సుంకం నుంచి మినహాయిస్తామంటూ.. వినియోగదారులపై ఈ భారం మోపమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఓ ట్వీట్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. దేశంలో పెరుగుతున్న పెట్రోల్,డీజీల్ ధరలకు సంబంధించి వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు. రాముడు పుట్టిన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.93 ఉంటే.. సీతమ్మ వారు పుట్టిన నేపాల్ దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.53 ఉందని.. ఇక రావణుడు ఏలిన రాజ్యం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.51 ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ ఫోట్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే మరోసారి అదే ఫోటోను బీజేపీ ఎంపీనే ట్వీట్ చేయడంతో మరింత వైరల్ అవ్వడమే కాకుండా.. హాట్ టాపిక్గా మారింది. ఈ ట్వీట్పై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు సుబ్రహ్మణ్య స్వామిని సమర్ధిస్తుంటే.. అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వరన్న అసహనంతో ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
— Subramanian Swamy (@Swamy39) February 2, 2021