ప్రస్తుత పరిస్థితులు జలియన్‌వాలా బాగ్‌ దమనకాండను తలపిస్తున్నాయ్‌..బీజేపీ ఎంపీ సంచలన ట్వీట్‌..!

Spread the love

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు జలియన్‌ వాలా బాగ్‌ దమనకాండను తలపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఓ వైపు జేఈఈ/నీట్‌ పరీక్షలు జరుగుతున్నాయని.. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఏర్పడిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు దేశంలో అనేక చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు.. జనజీవనాన్ని అస్థవ్యస్థం చేయగా.. ఇంకోవైపు ఇదే అదనుగా డ్రాగన్‌ కంట్రీ దేశ సరిహద్దులను దాటేందుకు కుట్రలు పన్నుతోందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుండగానే బాలీవుడ్‌లో జరుగుతున్న అరాచకాలపై కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. జలియన్‌వాలా బాగ్‌ దమనకాండను తలపిస్తుందంటూ ట్వీట్‌ చేశారు.


Spread the love
error: Content is protected !!