ముందస్తు జాగ్రత్త.. నగరానికి చేరుకున్న బోట్లు..వీడియో

Spread the love

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంలో హైదరాబాద్‌ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. నిరంతరంగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. రోజు కురుస్తున్న వర్షాలకు పనులకు ఆటంకం ఎదురవుతోంది. వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి సహాయాన్ని అందించడంలో గానీ.. సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఇబ్బందులు రాకుండా.. వేగంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.


మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వివిధ పర్యాటక ప్రాంతాలకు చెందిన బోట్లను నగరానికి చేరుకున్నాయి.

Boats Reached Hyderabad Ahead of Rain Alert.. Gaganam

Spread the love
error: Content is protected !!