కరోనా దెబ్బ మములుగా లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా పేరు చెప్తే వణికిపోతున్నాయి. ఇక మన దేశంలో కూడా ఈని ప్రభావం ఉండటంతో.. ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు ,కాలేజీలు,సినిమా హాళ్లు మూసేశారు. ఇక తాజాగా సెంట్రల్ అండ్ వెస్టర్న్ రైల్వే కరోనా ఎఫెక్ట్ తో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏసీ బోగీల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులు.. ఎవరి బెడ్ షీట్లు, దిండ్లు వారే తెచ్చుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అంతేకాదు.. అన్ని రైళ్లలోని ఏసీ బోగీల్లో ఉన్న అన్ని కర్టెన్లను తొలగించాలని.. దిండ్లు, బెడ్ షీట్లు ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్లు వెస్టర్న్ రైల్వే PRO ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ఎవరైనా కరోనా సోకిన వ్యక్తులు ట్రైన్ ఎక్కితే.. అప్పుడు కర్టెన్లు, దిండ్లు, బెడ్షీట్ల ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటు వెస్టర్న్ రైల్వేతో పాటుగా.. అటు సెంట్రల్ రైల్వే కూడా ఏసీ బోగీల్లోని కర్టెన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.త్వరలో మిగతా రైల్వే జోన్స్ కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.