గోమాతా.. హిందువులు ఎంతో పరమపవిత్రంగా పూజిస్తారు. తల్లితో సమానంగా భావిస్తారు. అంతేకాదు.. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం.చిన్న పిల్లలకు తల్లి పాలు లేకపోతే.. ఆవు పాలు పట్టిస్తారు. ఎందుకంటే.. తల్లి పాలలో ఉండే విటమిన్లు ఆవు పాలలో లభిస్తాయని. అంతేకాదు.. గోమాతకు సంబంధించిన గోమూత్రం, గో పేడను కూడా ప్రస్తుతం ఔషధాలకు, ఎరువులకు సంబంధించిన వాటిలో ఉపయోగిస్తున్నారు. ఇదంతా మనందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కూడా గోవు రక్షిస్తుందా..? అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మన దేశంలో అనుకునేరు.. కానేకాదు. ఇది యూఎస్ లోని డకోటాకు చెందిన సాబ్ బయోథెరపీటిక్స్ అనే ఫార్మా కంపెనీ పరిశోధనలు చేస్తోంది.
కరోనా మహమ్మారితో యుద్ధం చేసేందుకు కొందరు అమెరికా శాస్త్రవేత్తలు గోమాతను నమ్ముతున్నారు. గోవులో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, మనిషి ప్లాస్మా కంటే.. గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు మరింత శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకోసం.. గోవుల్లోనే కృత్రిమంగా కరోనా యాంటి బాడీలను తయారు చేసే పరిశోధనలు చేపడుతున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకు ఔషధం కనిపెట్టే క్రమంలో గోమాత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అయితే మనదేశంలో కరోనా పేషెంట్లను కాపాడేందుకు బాగా వినిపిస్తున్న ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ. మన తెలంగాణలో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ సక్సెస్ఫుల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ బారినపడి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు తయారవుతాయి. ఇవి రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి. అందుకోసమే.. వైరస్ బారినపడి కోలుకున్న వారిని ప్లాస్మా దానం చేయాలని అంతా పిలుపునిస్తున్నారు. అయితే ఇది ఆచరణలో కాస్త ఇబ్బంది తలెత్తుతోంది. ఈ క్రమంలోనే డకోటాకు చెందిన శాబ్కు చెందిన శాస్త్రవేత్తలు గోవుల విషయాన్ని
ముందుకు తెస్తున్నారు. ఎందుకంటే గోవులకు మనుషులకు సోకే వైరస్ మహమ్మారులను ఎదుర్కొనే శక్తి పుష్కలంగా ఉంటుందని అనేక మార్లు రుజువైంది. అంత్రాక్స్, స్మాల్ పాక్స్, ఇన్ ఫ్లూయెంజా వంటి మహమ్మారి వైరస్లకు గోవు శరీరంలో తయారైన యాంటీ బాడీలతోనే ట్రీట్మెంట్ చేస్తారు. ఆ చికిత్సలన్నీ ఇప్పటికే విజయవంతం అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే యూఎస్లోని సౌత్ డకోటాకు చెందిన.. సాబ్ బయోథెరపీటిక్స్ అనే ఫార్మా సంస్థ.. ప్లాస్మా యాంటీ బాడీల క్లోనింగ్ను గోవులలో చేస్తోంది. గోవుల యాంటీ బాడీలను, హ్యూమన్ యాంటీ బాడీలను కలిపేస్తున్నారు. అనంతరం వీటి డీఎన్ఏ సెల్స్ను ప్రయోగశాలలో గోవు అండాల్లో ప్రవేశపెడుతున్నారు. అలా ఎదిగే గోవులు.. ఆ తర్వాతి కాలంలో యాంటీ బాడీలుగా మారుతాయని.. సాబ్ బయోథెరపీటిక్స్ సంస్థ పేర్కొంది. మరి చూడాలి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో అన్నది. అయితే ఆవుల ద్వారా ప్రయోగాలు ఎందుకు..? ఇతర వాటిపై ప్రయోగాలు చేయవచ్చు కదా..? అన్న ప్రశ్నలకు శాబ్ సంస్థ సమాదానం ఇస్తోంది. గోవుల్లో ఎలాంటి హానీ లేకుండా నెలకు దాదాపు30 నుంచి 45 లీటర్ల ప్లాస్మాను సేకరించవచ్చని తెల్పుతోంది.
Data shows that SAB-185, our human polyclonal #antibody #therapeutic, has potent neutralizing activity against live SARS-CoV-2. We're on track to be ready for trials of this #COVID19 therapeutic candidate in early summer, & clinical production is underway: https://t.co/AfDeSv05As pic.twitter.com/MIIXwcc4To
— SAB Biotherapeutics (@SABBantibody) May 28, 2020
The SAb Biotherapeutics team was proud to be featured this morning on @CNN. #ICYMI, click below to learn more about our innovative approach to developing a #therapeutic treatment to combat #COVID19. #coronavirus #polyclonal https://t.co/1zzXfkaquj
— SAB Biotherapeutics (@SABBantibody) May 15, 2020
"Cows' Antibodies May Help Humans During #COVID19 Crisis" Another great example of how DoD uses science to #DetectDeterDefeat all sorts of #CBRN threats! #DTRA & @BARDA started funding @SABBantibody last year to protect US troops from emerging biothreats https://t.co/AQVpzKxT3H pic.twitter.com/OtA06jSLii
— Defense Threat Reduction Agency (@doddtra) June 16, 2020