పశువుల అక్రమ రవాణా చేపడుతున్న వారిపై బార్డర్లో పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాల గుండా ఈ పశువుల అక్రమ రవాణా అనేది కొనసాగుతోంది. అందులో వెస్ట్ బెంగాల్లో నిత్యం సరిహద్దు కంచెపై నుంచి పశువులను తరలించే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొన్నటి వరకు బీఎస్ఎఫ్ బలగాల పరిధి కేవలం 5 కిమీ వరకు మాత్రమే ఉండేది.. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ పరిధి 50 కిమీ వరకు ఉంటోంది. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు.. అక్రమ చొరబాటు దారులను, అక్రమ రవాణాలను అరికట్టేందుకు మరింత అవకాశం పెరిగింది.
బీఎస్ఎఫ్ సిబ్బందిపైనే దాడి..
తాజాగా నవంబర్ 12వ తేదీన వెస్ట్ బెంగాల్లోని కుచ్బిహార్ జిల్లాలోఇ సీతాయ్ ప్రాంతంలో ఉన్న ఇంబో-బంగ్లా బార్డర్ సమీపంలో పశువుల అక్రమ రవాణ జరుగుతుండటాన్ని బార్డర్లో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ బలగాలు గమనించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిచారు. ఈ క్రమంలో స్మగ్లర్లు.. బీఎస్ఎఫ్ సిబ్బందిపై ఇనుప రాడ్లు, కర్రలు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు స్మగ్లర్లు హతమయ్యారు. అయితే స్మగ్లర్ల దాడిలో ఓ జవాన్ కూడా గాయపడ్డారు.
నివేదికల ప్రకారం..
నివేదికల ప్రకారం.. నిత్యం కొంతమంది బంగ్లాదేశ్కు చెందిన స్మగ్లర్లు ఇనుప రాడ్ల సహాయంతో బార్డర్లో ఉన్న ఫెన్సింగ్పై నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. కంచెపై నుంచి దాటించేందుకు ఇనుప కడ్డీలను, నిచ్చెనలను ఉపయోగస్తున్నారు. వారు వీటి గుండానే భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. పశువులను అపహరించుకుపోవడం చేస్తున్నారు. అయితే నవంబర్ 12వ తేదీన తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో ఇలాంటి ఘటనను గస్తీలో ఉన్న బలగాలు గుర్తించడంతో.. వారిని భారత భూభాగంలోకి అడుగుపెట్టొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే బలగాల హెచ్చరికలను పట్టించుకోకుండా.. వారిపైకి దాడికి యత్నించారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ సిబ్బంది ప్రాణాంతకం కానీ ఆయుధాలను స్మగ్లర్లపైకి ప్రయోగించారు. అయితే స్మగ్లర్లు మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురు దాడి చేయడంతో కాల్పులు జరిపారు. అయితే తెల్లవారు జామున అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఇద్దరు స్మగ్లర్ల మృతదేహాలను గుర్తించారు.
Two Bangladeshi smugglers were killed along India-Bangladesh border in Cooch Behar district, West Bengal. One BSF trooper also injured as the smugglers attacked the BSF party trying to stop them while entering Indian territory. The incident took place around 3 am today: BSF pic.twitter.com/SYOhxOyP95
— ANI (@ANI) November 12, 2021
ఈ ఘటనకు సంబంధించి బీఎస్ఎఫ్ అధికారులు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఘటన జరిగిన తేదీ, సమయంతో పాటుగా.. ఇద్దరు స్మగ్లర్లు మృతిచెందారని.. ఒక జవాన్ గాయపడటంతో సదరు జవాన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
The miscreants from Bangladesh side ventured into Indian side, tried to smuggle cattle using improvised bamboo cantilever. BSF had warned them to go back. Our troops utilised non lethal weapons to deter miscreants, but they attacked on BSF troops with ironrods & sticks: BSF pic.twitter.com/CzvY3BjfMV
— ANI (@ANI) November 12, 2021
ఇద్దరు కాదు.. ముగ్గురు స్మగ్లర్లు చనిపోయారన్న జర్నలిస్టు..
మరోవైపు స్థానికంగా ఉన్న ఓ జర్నలిస్టు ఇద్దరు కాదు.. ముగ్గురు స్మగ్లర్లు హతమయ్యారంటూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జర్నలిస్టు అనుపమ్ మిశ్రా తన అధికారిక ట్విట్టర్లో మృతుడికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు ఇద్దరు కాదు.. ముగ్గురు స్మగ్లర్లు హతమయ్యారని తెలుస్తోంది. కానీ అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు.
Three dead in an encounter between BSF and cattle smugglers at coochbehar. Tmc claims that this incident is a fallout of centres notification expanding bsf jurisdiction to 50 km. Today Home secretary Ajay bhalla meeting with bengal home sec and chief sec on bsf jurisdiction issue pic.twitter.com/2FD5RZ4biv
— Anupam Mishra (@Anupammishra777) November 12, 2021
బీఎస్ఎఫ్కు బార్డర్లో 5 కిమీల నుంచి 50 కిలోమీటర్ల వరకు పరిధిని పెంచడంపై వెస్ట్బెంగాల్లో ఉన్న అధికార పార్టీ టీఎంసీ మండిపడుతోందని.. బీఎస్ఎఫ్ పరిధి పెరగడంతోనే ఈ ఘటన జరిగిందని టీఎంసీ ఆరోపిస్తుందంటూ జర్నలిస్టు అన్నారు. అయితే ఇప్పటికే ఈ స్మగ్లర్లకు కొందరు టీఎంసీ నేతలకు లింకులు ఉన్నట్లు అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అంతేకాదు.. కొందరు టీఎంసీలో ఉన్న ముస్లిం నేతలు.. ఈ విషయంలో టీఎంసీకి చెందిన హిందూ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు కూడా ఓ జాతీయ వెబ్పోర్టల్ కథనం ప్రచురించింది. హిందూ టీఎంసీ నేతను.. ఓ ముస్లిం టీఎంసీ నేత మర్డర్ చేయించాడని ఓ కేసు కూడా నమోదైంది. ఈ హత్యకు కారణం.. ఇరువురి మధ్య పశువుల అక్రమ రవాణాను మానేయాలని సదరు హిందూ నేత అడగడమేనంటూ అక్కడి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయినట్లు ఆ వెబ్సైట్ కథనం ప్రచురించింది.