విషాద సంఘటన.. కేంద్ర మంత్రి వాహనానికి ప్రమాదం..మంత్రి సతీమణి మృతి

Spread the love

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది.కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ పాద నాయక్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే వాహనంలో ఉన్న మంత్రి సతీమణి శ్రీమతి విజయ పాద నాయక్ ప్రాణాలు కోల్పోయారు.అంతేకాదు ఆయన వ్యక్తిగత సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇద్దరు గన్ మెన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక నార్త్ ప్రంతలోని యెళ్లపూర్ దగ్గర ఓ ఫంక్షన్ కి హాజరయి వస్తుండగా వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు.


Spread the love
error: Content is protected !!