దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాదు.. అనేక మంది ఆస్పత్రి పాలవుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఆక్సిజన్ అవసరం పెరిగింది. అదే సమయంలో కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ను ప్రధాన మెడిసిన్గా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ధర ఎక్కువగా ఉండటం.. అదే సమయంలో మార్కెట్లో దీని డిమాండ్ పెరగడంతో ఈ మెడిసిన్ బ్లాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో కరోనా బాధితులు దీని ఖర్చును బరించలేకపోతున్నారు. దీంతో కేంద్రం దీనిపై దృష్టిసారించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెమ్డెసివిర్ ధరను భారీగా తగ్గించి.. కరోనా పేషెంట్లకు భారీ ఊరటను కల్పించింది. ఏకంగా దీని ధరను 50 శాతానికి తగ్గించడంతో.. వీటి ధరలు అమాంతం తగ్గిపోయాయి. అంతేకాదు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ప్రయత్నించడంతో అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్రం అడుగులు వేస్తోంది. తగ్గించిన ధరలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ధర రూ.2,450 గా ఉండగా.. తగ్గింపు తర్వాత రూ.1,225 కే లభించనుంది. అయితే ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. వీటిలో క్యాడిలా హెల్త్కేర్ లిమిటెడ్ రెమ్డాక్ ధర.. రూ.2,800 ఉండగా.. తగ్గిన ధరలతో కేవలం రూ.899/- లభించనుంది. ఇక అలాగే సింజెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు చెందిన రెమ్విన్ ధర ప్రస్తుతం రూ.3,950 ఉండగా.. ఇప్పుడు 2,450కి తగ్గింది. మిగతా కంపెనీలకు చెందిన ధరలు.. కింద ట్విట్టర్ లింకులో చూడవచ్చు.
To meet the increasing demand of #Remdesivir and to enhance its availability and affordability, the Govt has capped its price. @PMOIndia #Unite2FightCorona @MoHFW_INDIA pic.twitter.com/G1MoAjMvB2
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 17, 2021