చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రమాదానికి గురైన కాన్వాయ్‌..!

Spread the love

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో ఆయన కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం సమీపంలో ఓ ఆవు అటుగా అడ్డు రావడంతో కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆ వెనుక ఉన్న రెండు వాహనాలు ఒకదానివెనుక ఒకటి ఢీ కొట్టుకున్నాయి. అయితే ఆ తర్వాతి వాహనంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్న వాహనం డ్రైవర్‌ వెంటనే అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఓ వాహనం ముందు భాగం దెబ్బతింది. అందులో ఉన్న భద్రతా సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.


Spread the love
error: Content is protected !!