దేశ వ్యాప్తంగా బులంద్షహర్ సాధువుల హత్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. యూపీలో జరిగిన ఈ సంఘటనలో నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.కొద్ది రోజుల క్రితమే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో సాధువులపై మూకదాడి చేసి ఇద్దర్ని హతమర్చడం.. ఆ తర్వాత దానిపై ఇంకా చర్చలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు యూపీలో కూడా మరో ఇద్దరు సాధువులు హత్యకు గురవ్వడంపై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే యూపీ సర్కార్ బులంద్షహర్ సమీపంలో జరిగిన సాధువుల హత్య ఘటనకు సంబంధించిన మురారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో నిందితుడు చెప్పిన మాటలు చూసి ఖంగుతిన్నారు పోలీసులు. తనకు సాధువులపై ఎలాంటి పగ లేదని.. వారిపై తనకు ఎలాంటి ద్వేశం కూడా లేదని పేర్కొన్నాడంటూ పోలీసులు వెల్లడించారు. అయితే దేవుడి కోరిక మేరకే ఆ ఇద్దరి సాధువుల్ని హతమార్చానంటూ చెప్పడంటూ పోలీసులు వెల్లడించారు. ఇక ఎలా చంపావని ప్రశ్నించగా.. ఘటనకు ముందు బంగ్ సేవించి ఆలయం వెళ్లి.. రాడ్తో సాధువులపై దాడికి పాల్పడ్డట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక గ్రామస్థుల వివరాల ప్రకారం.. మురారి అలియాస్ రాజు.. గంజాయి సేవిస్తుంటాడని.. గత రెండు రోజుల క్రితమే.. ఈ దేవాలయంలో ఉన్న ఇద్దరు సాధువులతో ఘర్షణకు దిగాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారిపై పగ పెంచుకుని కత్తితో హత్య చేసి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
కాగా.. మొత్తానకి యావత్ భారత దేశం.. ఓ వైపు కరోనాతో భయం గుప్పిట్లో వణుకుతుంటే.. వరుసగా సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి.