ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది. శుక్రవారం నాడు సాయంత్రం రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో అటుగా వచ్చిన మావోయిస్టు బృందం భద్రతా బలగాలపై దాడులకు దిగింది. దీంతో అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఓ మావోయిస్టు హతమయ్యాడు. అయితే మృతిచెందిన మావోయిస్టు మిలీషియా కమాండర్ మాద్వీ భీమా అని గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా ఉందని.. ఒక రైఫిల్, ఐఈడీ వైరింగ్, ఐదు కిలోల ఐఈడీ, 20 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, రెండు బీజీఎల్ షెల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు.
A Naxal, identified as Madvi Bheema, Militia Commander, was killed in an encounter in a joint op of security forces in Chhattisgarh's Sukma district around 5.30 pm on Friday (November 26). 1 rifle, 1 IED weighing about 5 kg, 2 BGL shell & 20 electric detonators recovered: CRPF
— ANI (@ANI) November 27, 2021