గాల్వన్‌ వ్యాలీ ఘర్షణలో చైనా కమాండింగ్ ఆఫీసర్‌ హతం..!

Spread the love

సరిగ్గా గత వారం రోజుల క్రితం గాల్వాన్‌ వ్యాలీలో చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత జవాన్లపై డ్రాగన్‌ కంట్రీకి సైనికులు ముల్లచువ్వలు ఉన్న రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మన భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. వీరిలో ఓ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. అయితే ఇదే ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు దాదాపు 45 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా చైనా మాత్రం తమ సైనికులు 30 మంది మరణించారని ప్రకటించింది. అయితే తాజాగా.. తమ కమాండింగ్ ఆఫీసర్‌ కూడా చనిపోయినట్లు చైనాకు చెందిన అధికారులు వాపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనం ఎకనామిక్స్‌ టైం వంటి జాతీయ మీడియాలో ప్రచురితమైంది.


Spread the love
error: Content is protected !!