సరిగ్గా గత వారం రోజుల క్రితం గాల్వాన్ వ్యాలీలో చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. లడఖ్లోని గాల్వాన్ లోయలో భారత జవాన్లపై డ్రాగన్ కంట్రీకి సైనికులు ముల్లచువ్వలు ఉన్న రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మన భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. వీరిలో ఓ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. అయితే ఇదే ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు దాదాపు 45 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా చైనా మాత్రం తమ సైనికులు 30 మంది మరణించారని ప్రకటించింది. అయితే తాజాగా.. తమ కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయినట్లు చైనాకు చెందిన అధికారులు వాపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనం ఎకనామిక్స్ టైం వంటి జాతీయ మీడియాలో ప్రచురితమైంది.
Chinese Commanding Officer Was Killed In Galwan Valley Clashes With Indian Army: China Admits During Talkshttps://t.co/moCpqSWDhx
— Swarajya (@SwarajyaMag) June 22, 2020