తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక కరోనాను జయించి 186 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు.ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్లో ఉన్నాయన్నారు. కేబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ ముఖ్యాంశాలు..
* రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కేసుల్లేవు అవి.. (వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి )
* కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవు
* ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం
* మే 1 వరకు కొత్త కేసుల సంఖ్య ఉండే అవకాశం
* గతంలో ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయి
* పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రమే చెప్పింది
* తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నాం
* మే 5న మరోసారి సమీక్ష.. అనంతరం తాజా నిర్ణయం
* ఆన్లైన్ ఫుడ్ సర్వీసులు (స్విగ్గీ,జోమాటో) బంద్
* ఎలాంటి పండగలైనా ఇళ్లలోనే జరుపుకోవాలలి.(పరిమిత సంఖ్యలో మాత్రమే)
* రంజాన్ మాసంలోఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు
* పోలీసులకు 10 శాతం బోనస్
* స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతంగా పని చేస్తున్నారు
* కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షణ బాగుంది
* ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా చర్యలు తీసుకోవాలి
* గతంలో ఇచ్చిన వేతనాలనే ఏప్రిల్ నెలలోనూ ఇస్తామం
* ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ ఫీజు తప్ప.. అదనపు ఫీజులేవీ తీసుకోవద్దు.
* అది కూడా నెలవారీగా మాత్రమే వసూలు చేయాలి..
* అకాడమిక్ ఫీజంతా ఓకే సారి కట్టాలని ఒత్తిడి చేయోద్దు.
* ఎవర్నైనా అలా అలా చేస్తే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం.